News March 27, 2025

తిరుమల:టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం

image

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది.

Similar News

News September 16, 2025

ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

image

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

వనపర్తి: పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు విద్యార్థులకు పోక్సో చట్టంపై నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్పీ గిరిధర్‌తో కలిసి ఉపాధ్యాయులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై నేరాలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. విద్యార్థులకు ఈ చట్టం గురించి బోధించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News September 16, 2025

అమరావతిలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ

image

అమరావతిలో 934 కి.మీ పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తోంది. 13 STPలు రోజుకు మొత్తం 330.57 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయని CRDA పేర్కొంది. ఇవి ఫ్లషింగ్, శీతలీకరణ & నీటిపారుదల కోసం నీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తాయి! నగరాన్ని పచ్చగా, స్థిరంగా మార్చడానికి ఒక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కూడా ప్లాన్ చేస్తున్నారు.