News January 19, 2026
తిరుమలలో ఆ మూడు విగ్రహాలు ఎవరివో తెలుసా..!

తిరుమల శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపంలో నమస్కారం చేస్తూ ముగ్గురు భక్తుల రాగి విగ్రహాలను ఎప్పుడైనా చూశారా. లాలాఖేమరాము (రాజా తోడరమల్లు), ఆయన తల్లి మాతా మోహనదేవి, భార్య పితాబీబీ. ఆర్కాట్ నవాబు సాదతుల్లాఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్నాటకను పర్యవేక్షించిన ప్రధానాధికారి, క్షత్రియవీరుడు తోడరమల్లు. 17వ శతాబ్దంలో మహమ్మదీయులు, ఆంగ్లేయుల నుంచి తిరుమల క్షేత్రాన్ని కాపాడారు.
Similar News
News April 15, 2026
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. మంథనిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మే నెలలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్మాణ పురోగతి ఆధారంగానే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.
News April 15, 2026
డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

డీలిమిటేషన్తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.
News April 15, 2026
నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. స్టూడెంట్స్ మన Way2newsలో సూపర్ ఫాస్ట్గా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే స్క్రీన్పై మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మార్కుల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది.
* ALL THE BEST


