News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.
News February 27, 2026
రాష్ట్రంలో 43 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

తెలంగాణ హైకోర్టులో 43 పోస్టులకు( ఆఫీస్ సబార్డినేట్ 34, డ్రైవర్ 9) అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏడో తరగతి, టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ , వైవా వోస్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://tshc.gov.in
News February 27, 2026
తుని: ఐదేళ్లు.. ముగ్గురు మహిళలు

తుని మున్సిపాలిటీ ఐదేళ్ల పాలనలో ముగ్గురు ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్గా ఉన్న నార్ల భువన సుందరి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. 2021లో YCP నుంచి ఏలూరి సుధారాణి బాధ్యతలు చేపట్టగా, 2025లో రాజీనామా చేశారు. అనంతరం కుచ్చర్లపాటి రూపాదేవి ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి భువన సుందరి చైర్ పర్సన్గా ఎంపికై పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నారు.


