News April 9, 2025
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
Similar News
News April 18, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గురువారం ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో కలిసి కుప్పిలి సంఘటనలో ఉపాధ్యాయుడుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కలెక్టర్ని కోరారు. హెచ్ఎం ప్రమోషన్ సీనియారిటీ లిస్టులో ఉన్న ఇద్దరి పైన కూడా ఛార్జెస్ పెండింగ్ను క్లియర్ చేసి ప్రమోషన్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
News April 17, 2025
శ్రీకాకుళం: భద్రతపై ఈవీఎం నోడల్ అధికారి సంతృప్తి

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్లోని గోదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
News April 17, 2025
శ్రీకాకుళం: మత్స్యకార ఆర్థిక భరోసాపై ఎన్యుమరేషన్

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక భరోసాకు శుక్రవారం నుంచి ఎన్యుమరేషన్ చేస్తామని జిల్లా ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరిస్తామన్నారు. నాటు పడవలో ఎంతమంది సముద్రంలో వేట చేస్తున్నారు. మోటార్ బోర్డుపై వేట చేస్తున్న మత్స్యకారుల డేటా ఆన్లైన్ చేస్తామన్నారు.