News January 1, 2026
తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం?

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.
Similar News
News February 14, 2026
రామాయంపేట: డైరెక్టర్గా ఉంటూ.. కౌన్సిలర్గా గెలుపు

మహంకాళి దేవాలయం డైరెక్టర్గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.
News February 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.
News February 14, 2026
సిద్దిపేట జిల్లాలో హస్తం, కారు జోరు.. కమలం బేజారు !

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపల్ పోరు కాంగ్రెస్, BRS మధ్యే జరిగింది. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ హుస్నాబాద్, చేర్యాలలో కనీసం ఖాతా తెరలేదు. దుబ్బాకలో 2 సీట్లు గజ్వేల్లో ఒక సీటుకే పరిమితమైంది. మొత్తం 4 మున్సిపాలిటీల్లో 3 BRS, ఒకటి కాంగ్రెస్ దక్కించుకుంది. మున్సిపల్ ఫలితాలపై BRS, కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉండగా బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.


