News August 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండి… క్యూ లైన్ టీబీసీ వరకు వెళ్లింది. సర్వదర్శనం కోసం సుమారు 18గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నిన్న స్వామివారిని 62, 569 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు MP నకిలీ PA అరెస్ట్..!

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని 4వ పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన నదీమ్‌గా ఎంపీ పీఏనని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో జమ్మలమడుగుకు చెందిన గొల్ల నరేశ్ అనే వ్యక్తిని బెదిరించాడు. వాళ్లు ఎంపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.

News February 19, 2026

నెల్లూరు జిల్లాలో రొయ్యలకు వైరస్

image

నెల్లూరు జిల్లాలో వాతావరణ మార్పులతో వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్ వైరస్ సోకింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో రొయ్యల తలపై తెల్లటి మచ్చలు ఏర్పడి, మేత మానేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్య పిల్లలు గుంటల్లోనే చనిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కోట, వాకాడు మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి రాక రైతులు తక్కువ ధరకే విక్రయిస్తూ కుదేలవుతున్నారు.

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.