News November 11, 2025

తిరుమలలో మీకు ఈ ప్రాంతం తెలుసా?

image

7 కొండలపై ఎన్నో వింతలున్నాయి. అందులో ‘అవ్వచారి కోన’ ఒకటి. ఇది తిరుమలకు నడిచి వెళ్లే పాత మెట్ల మార్గంలో మోకాళ్ల మిట్టకు ముందు ఉండే ఓ లోతైన లోయ. పచ్చని చెట్లతో దట్టంగా, రమణీయంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశానికి ఆ పేరు రావడానికి కారణం అవ్వాచారి అనే భక్తుడు. ఆయన ప్రేరణగా ఈ లోయకు ‘అవ్వాచారి కోన’ అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ లోయ తిరుమల యాత్రలో భక్తులు దాటే ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

image

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్‌మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయి.

News November 11, 2025

బిహార్‌లో NDA జయకేతనం: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

image

బిహార్‌లో BJP, JDU నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, NDAకి 133-159, మహాఘట్ బంధన్‌కు 75-101, ఇతరులకు 2-8 స్థానాలు, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వివరించింది. దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమిపై NDA పైచేయి సాధించనున్నట్లు తెలిపింది.

News November 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య <<18257519>>ఎదురు కాల్పులు<<>> జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.