News September 13, 2025

తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

image

తిరుమలలో శ్రీవారి భక్తుల మొబైల్ ఫోన్లను దొంగలించే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.5 లక్షల విలువ గల 15 మొబైల్ ఫోన్లు, 20 గ్రా. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భక్తుడి ముసుగులో తరచుగా తిరుమల వస్తూ సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించే వాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెట్టు కిశోర్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 12, 2026

సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

image

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)

News April 12, 2026

కృష్ణా: బందరు TDP-JSP కూటమి కోటకు బీటలు

image

మచిలీపట్నంలో JSP కార్యకర్త ఇంటి కూల్చివేత, అనంతరం MP బాలశౌరి జోక్యంతో మంత్రి కొల్లు, JSP నేతల మధ్య దూరం పెరిగింది. కొద్దిరోజులుగా మంత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు JSP శ్రేణులు, స్థానిక ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ దూరంగా ఉంటున్నారు. 30% కోటా అమలు చేయడం లేదని, తమను విస్మరిస్తున్నారని JSP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫూలే జయంతిని కూడా వేరువేరుగా నిర్వహించడం ఈ విభేదాలకు నిదర్శనంగా మారింది.

News April 12, 2026

కృష్ణా: బందరు TDP-JSP కూటమి కోటకు బీటలు

image

మచిలీపట్నంలో JSP కార్యకర్త ఇంటి కూల్చివేత, అనంతరం MP బాలశౌరి జోక్యంతో మంత్రి కొల్లు, JSP నేతల మధ్య దూరం పెరిగింది. కొద్దిరోజులుగా మంత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు JSP శ్రేణులు, స్థానిక ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ దూరంగా ఉంటున్నారు. 30% కోటా అమలు చేయడం లేదని, తమను విస్మరిస్తున్నారని JSP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫూలే జయంతిని కూడా వేరువేరుగా నిర్వహించడం ఈ విభేదాలకు నిదర్శనంగా మారింది.