News January 31, 2025
తిరుమలలో సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్ఠతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లోకి సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.
Similar News
News February 24, 2026
కల్తీ నెయ్యిపై నేడు అసెంబ్లీలో చర్చ

AP: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చించనుంది. ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన 10 మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడనున్నారు. గొంతునొప్పి కారణంగా నిన్న సభకు హాజరుకాని డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మ.12.30 నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడి చివరలో ఓ ప్రకటన విడుదల చేస్తారు.
News February 24, 2026
నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు – నివారణ

నువ్వుల పంటను పేనుబంక, పచ్చదోమ, తెల్లనల్లి, తామర పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకులు వాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. పేనుబంక, తామరపురుగు, పచ్చదోమ నివారణకు KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోఫ్రిడ్తో విత్తనశుద్ధి చేయాలి. లీటరు నీటికి డైమిథోయేట్ 1.6ml లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.


