News February 10, 2025
తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నలుగురు అరెస్టు.. ఏ1 ఎవరో ..?

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురు కీలక నిందితులను సిట్ ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు ఏ4 విపిన్ జైన్, ఏ3 పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్, ఏ2 ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్లను అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడెవరో ఇంకా నిర్ధారించలేదు. టీటీడీలో పనిచేసిన కీలక అధికారి లేదా బోర్డులోని కీలక వ్యక్తిని కేసులో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Similar News
News January 2, 2026
ఇన్స్టాలో కోహ్లీ పోస్ట్.. 3 గంటల్లోనే 50L లైక్స్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తన భార్య అనుష్కతో తీసుకున్న చిత్రం వైరలవుతోంది. 3 గంటల్లోనే 50 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం లైక్స్ 81 లక్షలు దాటాయి. Dec 31న పోస్ట్ చేసిన మరో ఫొటోను గంటలోనే 40 లక్షల మంది ఇష్టపడటం గమనార్హం. కాగా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ODIలు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.
News January 2, 2026
CM రేవంత్ వ్యూహాత్మక అడుగులు!

TG: అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు. KCRని ఏ అంశాలపై ప్రశ్నించదలిచారో <<18735385>>ప్రెస్మీట్<<>> పెట్టి మరీ వెల్లడించారు. సభలో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. దీంతో ఇవన్నీ అసెంబ్లీ సమావేశాలపై రేవంత్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులేనా అన్న చర్చ సాగుతోంది.
News January 2, 2026
చైనాలో కండోమ్ ట్యాక్స్.. ‘ధరలు పెంచితే పిల్లలు పుట్టేస్తారా?’

కండోమ్లపై చైనా 13 శాతం పన్ను విధించింది. గర్భనిరోధక వస్తువులు, మందులపై ఈ ట్యాక్స్ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. గతంలో వన్ చైల్డ్ పాలసీ సమయంలో వీటికి మినహాయింపులు ఇచ్చింది. కానీ జననాల రేటు భారీగా పడిపోవడంతో గర్భనిరోధకాలను వాడకుండా పన్ను విధించింది. దీంతో ధరలు పెరిగితే పిల్లలు పుట్టేస్తారా అంటూ చైనా యువత SMలో సెటైర్లు వేస్తోంది. ‘ఏడాదికి సరిపడా ముందే కొనేశా’ అని ఓ యూజర్ పేర్కొన్నారు.


