News June 29, 2024

తిరుమల: ఘాట్ రోడ్లోకి వచ్చిన ఏనుగులు

image

తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.

Similar News

News February 14, 2026

చిత్తూరు: నీరున్నా వృథాగా వాడితే ఇబ్బందులే.!

image

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.

News February 14, 2026

చిత్తూరు జిల్లా నేతలతో లోకేశ్ సమావేశం

image

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.

News February 14, 2026

చిత్తూరు: 18 సమస్యలకు పరిష్కారం

image

జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లలో 22,LT లైన్లలో 163, సర్వీసులైన్‌లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు.