News January 19, 2026
తిరుమల: లక్కీడిప్లో సులభంగా సెలెక్ట్ అవ్వాలంటే?

ఆన్లైన్ లక్కీడిప్లో పోటీ చాలా ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే తిరుమలలో నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ విధానంలో తక్కువ మంది పోటీ పడతారు కాబట్టి, సేవల్లో పాల్గొనే భాగ్యం త్వరగా లభిస్తుంది. తిరుమలకు వెళ్లినప్పుడు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవడం మంచిది.
Similar News
News January 30, 2026
VASTHU: ఇంటి ప్రాంగణంలో ఏ చెట్లు పెంచాలంటే?

ఇంటి ప్రాంగణంలో తులసి, బిల్వం, పసుపు వంటి దేవతా వృక్షాలు పెంచాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత చేకూరుతాయని అంటున్నారు. ‘మల్లె, గులాబీ మొక్కలు పెంచాలి. వీటి పరిమళాలు మనసుకి ఆనందాన్నిస్తాయి. మనీ ప్లాంట్, తమలపాకు మొక్కలు శుభప్రదమే. అవసరాల మేర కరివేపాకు, అరటి, నిమ్మ, ఆకుకూరలు కూడా పెంచవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 30, 2026
దేశ తొలి బడ్జెట్.. విశేషాలివే

బ్రిటిష్ పాలనలో APR 7, 1860 తొలి దేశ బడ్జెట్ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో NOV 26, 1947న షణ్ముఖం చెట్టి బడ్జెట్ పద్దును పార్లమెంటులో వినిపించారు. AUG 15, 1947 నుంచి MAR 31, 1948 మధ్య కాలానికే దీన్ని ప్రవేశపెట్టారు.
* ఆదాయ అంచనా ₹171.15Cr(సాధారణ వసూళ్లు-₹88Cr, పోస్టు, టెలిగ్రాఫ్లు-₹15Cr)
* వ్యయం అంచనా ₹197.39Cr(రక్షణ-₹92Cr, మిగతా మొత్తం పౌర ఖర్చులు).
* లోటు ₹26 కోట్లు.
News January 30, 2026
అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వారి ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ‘29,233 మందికి 69,421ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 1914 మందికి 7273 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. డ్రైన్లు నిర్మించాక సర్వే రాళ్లు వేయాలని రైతులు కోరారు. వర్షాకాలం నాటికి ప్లాట్లలో పూర్తి సదుపాయాలు కల్పిస్తాం’ అని కమిటీ భేటీ అనంతరం చెప్పారు.


