News November 20, 2025

తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

image

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.

Similar News

News November 23, 2025

నిర్మల్: భవితా కేంద్రాల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

మండల కేంద్రాల్లోని భవితా కేంద్రాల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఫిజియో థెరపిస్ట్(8), స్పీచ్ థెరపిస్ట్(8), ఆయా(కేర్ గివింగ్ వాలంటీర్)(10) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన వారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు బయోడాటా, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, 2 పాస్పోర్ట్ ఫొటోలను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.

News November 23, 2025

సమస్య మీది.. పరిష్కారం మాది: తూ.గో కలెక్టర్

image

ఈనెల 24న కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

News November 23, 2025

సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

image

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.