News July 1, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నం

image

కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Similar News

News September 21, 2024

నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?

image

నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 21, 2024

కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి: కేసీఆర్

image

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు.

News September 21, 2024

బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.