News November 26, 2025

తిరుమల PAC 1, 2 & 3 భవనాలకు రూ.9 కోట్లు విరాళం

image

తిరుమల PAC 1, 2 & 3 భవనాల అధునీకరణకు దాత మంతెన రామలింగ రాజు రూ.9 కోట్లు విరాళం అందించారు. కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై ఈ విరాళం సమర్పించారు. 2012లో కూడా రూ.16 కోట్లు విరాళమిచ్చిన రామలింగ రాజును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు అభినందించారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ధ్యేయంతో విరాళం అందించిన దాతను టీటీడీ అధికారులు ప్రశంసించారు.

Similar News

News November 26, 2025

ఢిల్లీలో గాలి కాలుష్యం.. శిశువులకు ఆటిజం ప్రమాదం

image

దేశ రాజధాని <<18386999>>ఢిల్లీ<<>>లో గాలి కాలుష్యం గర్భిణులు, నవజాత శిశువులకు హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. PM2.5 కణాలు రక్తంలోకి చేరి గర్భంలోని శిశువు మెదడు పెరుగుదలపై ప్రభావం చూపి ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. గాలి కాలుష్యం ఊపిరితిత్తులకు మాత్రమే హాని కాదని, శరీరంలోని నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. మెదడు పనితీరు తగ్గడంతోపాటు జ్ఞాపకశక్తి మందగిస్తుందని ఒక సర్వేలో తేలింది.

News November 26, 2025

వరంగల్: రైతన్నకు స్వల్ప ఊరట.. పెరిగిన పత్తి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు నేడు స్వల్ప ఊరట లభించింది. గత రెండు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.6,925కి చేరింది. దీంతో రైతన్నకు స్వల్పంగా ఊరట లభించగా.. ధర మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.

News November 26, 2025

అనంతగిరి: ముగ్గురిని బలిగొన్న పడవ

image

అనంతగిరి మండలం జీనబాడు రేవు వద్ద రైవాడ జలాశయంలో ఆదివారం జరిగిన పడవ బోల్తా ఘటనలో గల్లంతైన మరో యువకుడు దబారి రమేశ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజులుగా గాలింపులు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశాయి. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు జలాశయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.