News April 13, 2025
తిరుమల: PIC OF THE DAY

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది.
Similar News
News April 2, 2026
పాలమూరు: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఉన్న శ్రీ సాయి బాలాజీ టవర్స్లోని ఫ్లాట్ నంబర్ 309లో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై టూ టౌన్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులు, కండోమ్ ప్యాకెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ ఐజాజుద్దీన్ పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు సంతోష్ రెడ్డి పరారీలో ఉన్నాడు.
News April 2, 2026
KNR: ‘తల్లికి ప్రేమతో’ చెరువు కట్టించిన సర్వాయి పాపన్న..!

కొండల నుంచి వచ్చే నీటిని వృథా కాకుండా సంరక్షించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ KNR(D) హుస్నాబాద్లో భారీ చెరువులను నిర్మించారు. రేణుక ఎల్లమ్మ పేరిట ఎల్లమ్మ చెరువు, ఆరాధ్య దైవంపై బయన్న చెరువు, తల్లి పేరిట సర్వమ్మ చెరువు వంటి గొలుసుకట్టు చెరువులను కట్టించారు. మైదానబావి, నీటి కొలనులు వంటి నీటి నిల్వలూ ఆయన ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ చెరువులు జల సంరక్షణలో పాపన్న దూర దృష్టిని తెలుపుతున్నాయి.
News April 2, 2026
ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవంలో CM దంపతులు

ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 6వసారి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీఎం దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పండు వెన్నెల్లో సుమారు 55వేల మందికిపైగా భక్తులు కళ్యాణాన్ని తిలకించారు.


