News April 7, 2025
తిరువూరు: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. కాగా నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలి అని కోరగా అతను నిరాకరించడంతో, మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్పై పలుచోట్ల దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన నవీన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 23, 2026
కాకినాడ: “నేను ఎక్కడికీ పారిపోలేదు”.. MLC అనంతబాబు క్లారిటీ!

డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రెండు రోజుల క్రితం శాసనమండలి నుంచి ఒంటరిగా వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ఆయన సోమవారం మండలికి విచ్చేసారు. సభలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. తాను ఎక్కడికి వెళ్లిపోలేదని ఆయన బొత్సకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News February 23, 2026
SKLM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడరాదని సూచించారు. పోలీస్ అధికారులు ఉన్నారు.
News February 23, 2026
HYD: తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో TG ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 8143165646ను సంప్రదించవచ్చు. site: pstucet.org


