News March 24, 2025

తిరువూరు: రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి.. కారణమిదే.!  

image

తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సరస్వతి(70), కుమారుడు కృష్ణ(53)ను ఆదివారం ఓ లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఇంత ఘోర ప్రమాదం జరిగినా లారీలు మాత్రం జనసంచారం ఉన్న ప్రదేశాల్లో హైస్పీడ్‌లో వెళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి లారీలు హైస్పీడ్‌లో వెళ్లకుండా కంట్రోల్ చేయాలని స్థానికులు, వాహనదారులు అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. 

Similar News

News September 16, 2025

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

image

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.

News September 16, 2025

పెద్దపల్లి: ‘మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి’

image

PDPLలో సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ-సశక్తి పరివార్ అభియాన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిరోజు ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. బాలికల గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్టులు, గర్భిణీలకు 100% ANC చెకప్, పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 16, 2025

జూబ్లీహిల్స్‌లో ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ ఫ్లెక్సీలు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజు రోజుకూ రాజుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరికివారు టికెట్ తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా రావాలి అంజన్న.. కావాలి అంజన్న అంటూ అంజన్ కుమార్ యాదవ్‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆయనా టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి.