News October 3, 2024
తిరువూరు: శావల దేవదత్కు శుభాకాంక్షల వెల్లువ
తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News October 3, 2024
VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్
ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.
News October 3, 2024
విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా
విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.
News October 3, 2024
17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్
పీఎం జనజాతీయ ఉన్నత గ్రామఅభియాన్(పీఎం జుగా) పథకంలో ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ గ్రామాలలో గిరిజన జనాభా ఎక్కువ ఉన్నందున ఈ పథకం అమలవుతుందని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు.