News August 13, 2024

తుంగభద్ర డ్యాం.. నీటి వృథా కాకుండా స్టాప్‌లాగ్‌

image

తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హొసపేటెలో స్టాప్‌లాగ్‌ గేటును కార్మికులు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన తర్వాతి నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.

Similar News

News December 30, 2025

పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

image

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.

News December 30, 2025

కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

image

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.

News December 30, 2025

కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

image

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.