News February 16, 2025
తుని: బ్యాంక్లో బంగారం గోల్మాల్.. ఖాతాదారుల ఆందోళన

తుని మండలం తేటగుంటలో కెనరా బ్యాంక్లో అవినీతి కేసు కలకలం రేపుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంలో తేడాలు ఉన్నట్లు గుర్తించడంతో, బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గోల్డ్ ఖాతాలు 3,500 ఉండగా 150 ఖాతాల్లో తాకట్టు బంగారం వ్యత్యాసం ఉన్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందవద్దని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Similar News
News September 19, 2025
IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.
News September 19, 2025
సరూర్నగర్ చెరువులో దూకి సూసైడ్

సరూర్నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.
News September 19, 2025
సరూర్నగర్ చెరువులో దూకి సూసైడ్

సరూర్నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.