News November 17, 2025

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫోన్ హ్యాక్

image

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.

Similar News

News November 17, 2025

తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

image

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్‌లో 47, ఫిజిక్స్‌లో 46, మ్యాథమెటిక్స్‌లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.

News November 17, 2025

తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

image

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్‌లో 47, ఫిజిక్స్‌లో 46, మ్యాథమెటిక్స్‌లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.

News November 17, 2025

కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

image

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 87 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.