News April 10, 2024

తుని: రైలు నుంచి పడి గుర్తుతెలియని మహిళ మృతి

image

రావికంపాడు – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ బుధవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 5అడుగులు ఎత్తు కలిగి పచ్చని చీర కట్టుకుని ఉంది. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో తరలించారు. ఆమె ఆచూకీ తెలిసినవారు తుని రైల్వేపోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లోవరాజుని సంప్రదించాలని కోరారు.

Similar News

News October 5, 2025

అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవం

image

జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” అవార్డుల ప్రదానోత్సవాన్ని అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆదివారం తెలిపారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జేసీ ఆదేశించారు.

News October 5, 2025

దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి మరో ఐదు గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 190 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు.

News October 5, 2025

రేషన్ కష్టాలు.. డీలర్ల భర్తీకి బ్రేక్

image

జిల్లాలో రేషన్ డీలర్ల పోస్టులో భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో రేషన్ సరుకులు తెచ్చుకోవడా నికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొవ్వూరు డివిజన్‌లో 59, రాజమహేంద్రవరం డివిజన్‌లో 92 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 5,63,094 రేషన్ కార్డులు, 871 రేషన్ షాపులున్నాయి. వీటిలో 151 చోట్ల డీలర్లు లేరు. గత సెప్టెంబర్‌లో సివిల్ సప్లై అధికారులు డీలర్ల భర్తీకి కసరత్తు చేసిన కోర్టు అభ్యంతరాలతో బ్రేక్ పడింది.