News August 21, 2024
తుని RTCకి రికార్డ్ స్థాయిలో ఆదాయం

తుని RTC డిపో ఒక్కరోజులో రూ.13.86 లక్షలు ఆదాయంతో 105% ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో ఆక్యూపెన్సి రేషియోలో మొదటి స్థానంలో నిలిచింది. వరుస సెలవులు, శ్రావణం, రాఖీ పౌర్ణమి, వివాహముహూర్తాలతో సోమవారం బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. తుని డిపో నుంచి నిత్యం 72 బస్సులను కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నడుపుతారు. రద్దీదృష్ట్యా నిన్న మరో 6 బస్సులు అదనంగా తిప్పారు.
Similar News
News February 10, 2026
రాజమండ్రి: శివరాత్రి ఉత్సవాలు.. వాటికి అనుమతి తప్పనిసరి

మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రధాన, ఇతర రహదారులపై అన్నదాన కార్యక్రమాల కోసం దాతలు ఏర్పాటు చేసే టెంట్లకు ముందస్తుగా పోలీస్ శాఖ నుండి అనుమతి తప్పనిసరి అని కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్న సంతర్పణ కేంద్రాలను మ్యాప్లో సూచించిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. భోజనం కోసం ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు, ఇతర వ్యర్థాలను కచ్చితంగా డస్ట్ బిన్లలోనే వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 10, 2026
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందిన ‘నన్నయ్య’

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ళ వేడుకల్లో 21,000 మంది విద్యార్థులు, సిబ్బందిచే జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించారు. ఈ క్రమంలో దేశభక్తి, ఐక్యతకు చిహ్నంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆఫ్ నేషనల్ రికార్డు ప్రదానం చేశారు. మంగళవారం వర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్ అందజేశారు.
News February 10, 2026
RJY: వెట్టి విమోచన చట్టం @ 50 ఏళ్లు.. పోస్టర్ ఆవిష్కరణ

వెట్టి విమోచన చట్టం అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో ప్రత్యేక అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా దీనిని ఆవిష్కరించారు. చట్టం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని వెట్టి విమోచన కోయిలేషన్ జిల్లా కన్వీనర్ విజయనిర్మల, ఆంజనేయులు తెలిపారు.


