News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

image

మెుంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, పశ్చి గోదావరి సర్కిళ్లలో ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొంది. తుఫాన్ కారణంగా GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం, తీరప్రాంతంలో కోత గురవడం వంటివి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు.

Similar News

News October 30, 2025

జిల్లాలో 77,415 ఎకరాల్లో పంట నష్టం: DAO

image

జిల్లా పరిధిలోని 25 మండలాల్లో మొంథా తుపాన్ ధాటికి 77,415 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని DAO సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరి 65,192 ఎకరాలు, మినుము 4,568, మొక్కజొన్న 3,441, పత్తి 3,244, కంది 507, శనగ 338.5, సోయాబీన్ 74.13, పెసర 49.5, నువ్వులు 6.92, జూట్ 5.9, జొన్న 5 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందన్నారు.

News October 30, 2025

2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.

News October 30, 2025

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: డీఈవో

image

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం ఎంఈవో శివప్రసాద్‌తో కలిసి ఉండవెల్లి మండలం బొంకూరులో ఎస్‌ఏ-1 పరీక్షల ప్రక్రియను ఆమె పరిశీలించారు. విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఎఫ్‌ఏ-1, 2 మార్కుల జాబితా నమోదు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.