News October 6, 2025
తుమ్మలలో ట్రాక్టర్ నడిపిన మంత్రి సత్యకుమార్

ధర్మవరంలోని తుమ్మలలో నిర్వహించిన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలసి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు.
Similar News
News April 2, 2026
చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
News April 2, 2026
కృష్ణా: పెరిగిన పాల ధరలు.. ఎంతంటే..!

ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై పాల ధరలు భారమయ్యాయి. లీటరు పాలపై రూ.2 చొప్పున ధర పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడనుంది.
News April 2, 2026
సాగర్ రికార్డు ‘పవర్’: రాష్ట్రంలోనే నంబర్ 1

జలవిద్యుత్ ఉత్పత్తిలో సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిన కేంద్రంగా నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా 2,572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సాగర్ తన సత్తా చాటిందని జెన్కో CE మంగేష్ కుమార్ వెల్లడించారు. 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉత్పత్తి జరగడం విశేషం.


