News October 18, 2025
తురకపాలెం మరణాలపై కలెక్టర్కు వినతిపత్రం

తురకపాలెంలో 46 పైచిలుకు మరణాలపై వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలలు గడిచినా వ్యాధి నిర్ధారణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్పెషలిస్టు వైద్యులు ఉండేలా క్లినిక్ ఏర్పాటు చేయాలని, మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News October 19, 2025
కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్కు అంగీకరించినట్లు ఖతర్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఈ చర్యలు రాబోయే రోజుల్లో పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. కాగా ఈ చర్చలకు ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయి.
News October 19, 2025
ఆరోగ్యం కోసం ‘ధన్వంతరీ మంత్రం’

నమామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం సకల ఔషధీనాం
ఈ మంత్రం ధన్వంతరి స్వామివారిని కీర్తిస్తుంది. ఆయన జయంతి రోజున ఈ మంత్రాన్ని చదవడం వల్ల సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర దినాన మందులు దానం చేయడం, నిస్సహాయులకు ఔషధాలను అందించడం వల్ల దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెబుతారు.
News October 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్లాండ్ ప్లేయర్ అన్యాపత్తో అమీతుమీ