News August 30, 2025

తుర్కపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన పర్వతం రాజు(20) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతం వాసుదేవ్ కుమారుడు రాజు కోల్తూరులో ఓ ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. విధులకు వెళుతుండగా వెనుకనుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News August 30, 2025

Fortune పవర్‌ఫుల్ ఉమన్ – 2025 వీళ్లే

image

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చున్ భారత వ్యాపార రంగంలో పవర్‌ఫుల్ ఉమన్ 2025 లిస్ట్ విడుదల చేసింది. ఇందులో FM నిర్మలా సీతారామన్, ముకేశ్ అంబానీ భార్య నీతా టాప్2లో ఉన్నారు. ఇక అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ రెడ్డి కూతుళ్లు శోభన, సంగీత, ప్రీతా, సునీత (బిజినెస్ సర్కిల్‌లో రెడ్డి సిస్టర్స్ అంటారు) 3, HCL ఫౌండర్ శివ నాడార్ కూతురు రోష్ని నాడార్ 4, నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా 5వ స్థానాల్లో నిలిచారు.

News August 30, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ మహిళలతో కలిసి RTC బస్సులో ప్రయాణించని హోంమంత్రి
➤ బైలపూడిలో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
➤ జన్నవరంలో భూవివాదంలో తండ్రి కూతుర్లపై దాడి
➤ వసతి గృహాల విద్యార్థులకు దోమల తెరలు పంపిణీ
➤ దేవరాపల్లి ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
➤ కోర్టు కానిస్టేబుళ్లు, CMS సిబ్బందితో SP సమీక్ష
➤ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
➤ కలిగొట్లలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

News August 30, 2025

దుష్ప్రచారం చేయడం తగదు: KMR MLA

image

వరద సమయంలో అధికారులతో పాటు తాను పని చేసిన పని చేయలేదని దుష్ప్రచారం చేయడం తగదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో మాట్లాడారు. ఎవరు ఊహించని విధంగా వర్షం పడటంతో వరదలు వచ్చాయన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. పట్టణంలో కలెక్టరేట్ తప్ప అన్ని కాలనీలో భారీగా వరద నీరు వచ్చిందన్నారు. వరదలతో నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.