News April 24, 2024
తులం బంగారం, లక్ష రూపాయలు ఎప్పుడిస్తారు?: మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో కరవు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగొలు చేయకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. CM మాటలు ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారన్నారు. కౌలు రైతులను కలుపుకుని రూ.90వేల కోట్లు రైతంగానికి ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం, రూ.లక్ష ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 30, 2024
జన్నారం: నేడు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు పట్టు పరిశ్రమ/పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.10 గంటలకు జన్నారం పట్టణంలోని పొన్కల్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు వస్తున్నారని వారు వెల్లడించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా సకాలంలో రావాలని వారు సూచించారు.
News September 30, 2024
కడెం ప్రాజెక్టు UPDATE
ఎగువ నుంచి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కుడి, ఎడమ కాల్వలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
News September 30, 2024
విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్
హైదరాబాద్లోని కొమరం భీం స్టడీ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.