News March 31, 2025

తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

image

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.

Similar News

News July 6, 2025

NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

image

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.

News July 6, 2025

చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

News July 6, 2025

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి చెందిన ఘటన <<16957129>>కట్టంగూరులో <<>>జరిగింది. శాలిగౌరారం(M)ఊట్కూరుకు చెందిన పిట్టల శంకరమ్మ, ఆమెకుమారుడు రజనీకాంత్‌ HYDలో నివాసం ఉంటున్నారు. నకిరేకల్‌(M) ఓగోడులో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌‌పై HYD బయలుదేరారు. KTNG బిల్లంకానిగూడెం సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో రజనీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన శంకరమ్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.