News March 19, 2024
తూర్పుగోదావరి: సెల్యూట్ ‘అమ్మ’❤

యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ చిన్నతనంలోనే నాన్న ప్రేమకు దూరమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా వారి చదువు, బాగోగులు అన్నింటినీ వాళ్ల అమ్మే చూసుకుంది. ఇద్దరు కొడుకులను బాగా చదివించింది. ఈ క్రమంలో ఇద్దరూ కానిస్టేబుళ్లు అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతులలో ఏఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్సై యూనిఫాంలో ఇంటికి వచ్చి వారి అమ్మకు సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు.
– GREAT కదా.
Similar News
News July 7, 2025
రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News July 7, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్కు 216 అర్జీలు

తూ.గో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 216 అర్జీలు అందినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల సమస్యల పరిష్కారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్కు 35 అర్జీలు

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 35 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, దొంగతనం కేసులు, ఇతర కేసులకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.