News September 25, 2025

తూ.గోలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో హౌస్ బోట్స్, క్రూయిజ్ అభివృద్ధిపై ఆమె సమీక్షించారు. గోదావరి తీరం, కడియం నర్సరీలు, దేవాలయాలు పర్యాటకులను ఆకర్షించే శక్తి కలిగి ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

Similar News

News September 27, 2025

తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రాలు

image

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తూ.గో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం. రాజమండ్రిలోని గోదావరి నది అందాలు, పురాతన శివాలయం మార్కండేయ దేవాలయం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం, ఆనకట్ట, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రం, కోనేటి శివాలయం వంటివి ఉన్నాయి. ఇంకా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.

News September 27, 2025

‘కొవ్వూరులో 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యం’

image

కొవ్వూరు డివిజన్‌లో ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణకు సుమారు 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యమని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. శుక్రవారం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలను ఒకే సారి ప్రారంభించి ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం చెల్లింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News September 27, 2025

ధవలేశ్వరం: మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద

image

గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు వివరించారు. 3 పంట కాలువలకు 10,600 క్యూసెక్కుల జలాలను అధికారులు విడుదల చేశారు. గోదావరికి వరద మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.