News June 17, 2024
తూ.గో: అమ్మలకు తప్పని కడుపు కోతలు
నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.
Similar News
News October 3, 2024
రాజోలు: రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
News October 3, 2024
రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.
News October 3, 2024
KKD: ఆ కసాయి తండ్రి దారుణాలెన్నో..?
కాకినాడ జగన్నాథపురం చెక్కావారి వీధిలో పండ్ల వ్యాపారి శివమణి తన బిడ్డను <<14248309>>చంపేసిన<<>> విషయం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన అతను తన మగబిడ్డను వైజాగ్లో అమ్మేశాడు. భర్త చనిపోయి నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయగా ఆడబిడ్డ పుట్టింది. ఆబిడ్డను అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనకపోవడంతో కోపంతో చిన్నారిని గోడకేసి కొట్టి హతమార్చాడు. నిందితుడిని వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావు అరెస్ట్ చేశారు.