News September 25, 2025
తూ.గో: ‘ఇండియా స్కిల్స్’ పోటీలు.. త్వరపడండి..!

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు ఆసక్తి గల యువత ఈ నెల 30 లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తూ.గో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి మురళి తెలిపారు. 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులు అర్హులన్నారు. యువతలోని సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇదో అద్భుత వేదిక అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 27, 2025
తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రాలు

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తూ.గో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం. రాజమండ్రిలోని గోదావరి నది అందాలు, పురాతన శివాలయం మార్కండేయ దేవాలయం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం, ఆనకట్ట, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రం, కోనేటి శివాలయం వంటివి ఉన్నాయి. ఇంకా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.
News September 27, 2025
‘కొవ్వూరులో 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యం’

కొవ్వూరు డివిజన్లో ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణకు సుమారు 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యమని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. శుక్రవారం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలను ఒకే సారి ప్రారంభించి ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం చెల్లింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News September 27, 2025
ధవలేశ్వరం: మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద

గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు వివరించారు. 3 పంట కాలువలకు 10,600 క్యూసెక్కుల జలాలను అధికారులు విడుదల చేశారు. గోదావరికి వరద మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.