News May 4, 2024

తూ.గో: ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల జోడింపు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈవీఎమ్ యూనిట్‌లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో శుక్రవారం నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎమ్‌ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్.తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.

Similar News

News July 8, 2025

తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.

News July 8, 2025

తూ.గో జిల్లాలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”

image

తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహాకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పేర్కొన్నారు.

News July 8, 2025

రాజమండ్రిలో వద్ద ‘దిశ’ సమావేశం

image

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ‘దిశ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.