News August 31, 2024
తూ.గో: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

తూ.గో జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన సంధ్యాకుమారి శుక్రవారం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల పుట్టింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంధ్యాకుమారికి ఆపరేషన్ జరిగింది. తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ తగిన బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. పెళ్లైన ఐదేళ్లకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
Similar News
News August 23, 2025
కాకినాడ: స్వర్ణాంధ్రాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి ‘పరిశుభ్రత’తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
News August 22, 2025
గుడ్డిగూడెంలో ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకొని ఆరుగురు కూలీలు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News August 22, 2025
కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.