News December 19, 2025
తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.
Similar News
News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


