News June 14, 2024

తూ.గో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి సోదరుడు మృతి

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాలరావు సోదరుడు విప్పర్తి రామారావు(75) గురువారం రాత్రి ధవళేశ్వరంలోని స్వగృహంలో మృతి చెందారు. రామారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇంటికి వెళ్లి జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావును పరామర్శించారు.

Similar News

News October 27, 2025

ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

image

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

News October 26, 2025

సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.

News October 26, 2025

రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

image

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.