News April 14, 2024
తూ.గో జిల్లాలో మొత్తం ఓటర్లు 16,16,918 మంది

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 16,16,918 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,89,443, మహిళలు 8,27,380, ఇతరులు 95 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 19,726 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,533 మంది కాగా.. మహిళలు 8,192 మంది ఇతరులు ఒకరు ఉన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు వయస్సు దాటిన వారు మొత్తం 8,284 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,536 మంది కాక మహిళలు 4,748 మంది ఉన్నారు.
Similar News
News October 7, 2025
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకతకు కృషి: జేసీ

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 871 చౌకధరల దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. రేషన్ కార్డుదారులకు 93% నుంచి 94% వరకు నిత్యావసర వస్తువులు సమయానికి సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
News October 6, 2025
నవోదయం 2.0 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్, జిల్లా అధికారుల సమీక్షలో ఆమె ఈ విషయం చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.
News October 6, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 25 పిర్యాదులు: ఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజావాణి) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.