News April 12, 2024
తూ.గో: తీవ్ర ఉత్కంఠ.. మరో గంటే..!

ఉమ్మడి తూ.గో ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 25,256 మంది, తూ.గో-41,382 మంది, కాకినాడ జిల్లాలో 44,179 మంది ఫస్ట్, సెంకడ్ ఇయర్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి తూ.గో జిల్లా ఫస్ట్ ఇయర్లో 6వ, సెకండ్ ఇయర్లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త జిల్లాల వారీగా ఫలితాలు వెలువడనుండగా.. ఏ జిల్లా ఏ స్థానంలో నిలువనుందో..?
Similar News
News October 6, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ కీర్తి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈనెల 6న జిల్లాలో యథాతధంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. పాత అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకోవడానికి 1100కు ఫోన్ నంబర్కి చేయాలన్నారు.
News October 5, 2025
అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవం

జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” అవార్డుల ప్రదానోత్సవాన్ని అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆదివారం తెలిపారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జేసీ ఆదేశించారు.
News October 5, 2025
దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి మరో ఐదు గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 190 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు.