News February 10, 2025

తూ.గో: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

తూ.గో.జిల్లాలో సోమవారం నుంచి 14వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ ఆర్‌ఐవో నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 77 సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి విడత ఈ నెల 10, 11, 12, 13, 14 తేదీల్లో 58 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

రాజమండ్రి: జైలులో సరెండర్ కాని బోరుగడ్డ అనిల్

image

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నిన్న సాయంత్రం 5గంటలతో ముగిసింది. మరో గ్రేస్ పీరియడ్‌తో జైలు అధికారులు ఎదురుచూసినా అనిల్ రాకపోవడం గమనార్హం. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

News March 11, 2025

తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

image

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!