News October 14, 2024
తూ.గో: పిడుగులు పడతాయి జాగ్రత్త
తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు సోమవారం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, రావులపాలెం, కోనసీమ, తుని, మారేడుమిల్లి, రంపచోడవరం, పెద్దాపురం, సామర్లకోట కోరుకొండ, రాజమండ్రి రూరల్ పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ ప్రజల చరవాణిలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News October 14, 2024
అమలాపురం: నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు
అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించాల్సి ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల లైసెన్సుల లాటరీ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని డివిజన్, మండల స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది తెలిపారు.
News October 14, 2024
ఆత్రేయపురం: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
ఆత్రేయపురం మండలంలో ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికను రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాము తెలిపారు.
News October 14, 2024
అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.