News July 20, 2024

తూ.గో: ‘పిడుగులు పడతాయ్.. జాగ్రత్త’

image

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజల చరవాణిలకు సంక్షిప్త సందేశాలు సైతం వచ్చాయి.

Similar News

News September 4, 2024

తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జిల్లాలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలను తెరవద్దని ఆయన సూచించారు.

News September 4, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2,99,854 క్యూసెక్కుల జలాలు

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి బ్యారేజీ నుంచి 2,99,854 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

News September 4, 2024

తూ.గో.: ఈ నెల 10 నుంచి పాఠశాలల క్రీడలు ప్రారంభం

image

తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ సంఘం ఆధ్వర్యంలో 2024- 25 విద్యా సంవత్సరంలో ఈ నెల 10- 13 వరకు మండల స్థాయి, 17- 21 వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతాయని డీఎస్ఈవో వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఓ విడుదల చేశారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు.