News July 4, 2024
తూ.గో.: బీ.టెక్తో ఉద్యోగాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా ఆధ్వర్యంలో డిప్లమా, బీ.టెక్ చదివిన వారికి ట్రైనీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తూ.గో. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు గురువారం తెలిపారు. 2019- 2024లో ఉత్తీర్ణత సాధించి, 18-25 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. https://forms.gle/7EzcxnL6Z2CqcbpC6 వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 15, 2025
తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
News December 15, 2025
తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
News December 14, 2025
రాజమండ్రి: టెట్ పరీక్షల్లో 129 మంది గైర్హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. రాజమండ్రి లూధర్ గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్లో 955 మందికి 895 మంది హాజరయ్యారని, 60 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్లో 700 మందికి 631 మంది హాజరైనట్లు, 69 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.


