News April 18, 2024
తూ.గో: భవనం పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి

తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తు బిల్డింగు పై నుంచి కిందపడి షేక్ అసిన్(35) మృతి చెందినట్లు ఎస్సై కే సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని భీమోలు గ్రామంలో ఉదయం10 గంటలకు దాబాపై తాపీ పని చేస్తుండగా దురదృష్టవశాత్తు పై నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో గోపాలపురం ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
Similar News
News October 8, 2025
బాణసంచా తయారీకి అనుమతులు తప్పనిసరి: జేసీ

జిల్లాలో బాణసంచా తయారీదారులు, విక్రయదారులు రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బాణసంచా తయారీ కేంద్రాలను రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు బాణాసంచా తయారు కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలన్నారు.
News October 8, 2025
కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పురందీశ్వరీ

కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్లో అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాలకు రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి హాజరయ్యారు. ఆమె కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ (CWP) చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివాన్ష్, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీలు అనురాగ్ శర్మ, కె.సుధాకర్ కూడా పాల్గొన్నారు.
News October 8, 2025
మందులపై పన్ను రద్దు.. ప్రజలకు ఊరట: జేసీ

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజల ఆరోగ్యానికి, కుటుంబ భద్రతకు మేలు చేసే విధంగా, సరళమైన, అందుబాటు ధరల్లో మార్పులకు శ్రీకారం చుట్టాయని జేసీ వై.మేఘ స్వరూప్ బుధవారం తెలిపారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ వ్యవస్థలో ఈ సవరణలు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే విధంగా 2.0 వెర్షన్ రూపుదిద్దుకుందని, ముఖ్యంగా మందులు, వైద్య సేవలు మరింత చౌకగా మారాయని ఆయన పేర్కొన్నారు.