News June 5, 2024

తూ.గో: మాజీ స్పీకర్ల వారసులను వరించిన విజయం

image

లోక్‌సభ, అసెంబ్లీ మాజీ స్పీకర్ల వారసులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
లోక్‌సభ మాజీ స్పీకర్‌ స్వర్గీయ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ 3,42,196 ఓట్ల మెజార్టీతో అమలాపురం ఎంపీగా అఖండ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య 15,277 ఓట్ల మెజార్టీతో తుని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

Similar News

News November 11, 2025

రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

image

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చన్నారు.

News November 10, 2025

రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

image

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునన్నారు.

News November 10, 2025

రాజమండ్రి: ఈ తేదీల్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్

image

లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్‌ను నవంబర్ 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. మైక్రోబాక్టీరియా లెప్రీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే చర్మవ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. చర్మంపై స్మర్శలేని మచ్చలు, బొడిపెలు, నరాల సమస్యలు గల వారు సమీపంలోని PHC, CHCలను వెంటనే సంప్రదించాలని సూచించారు. చికిత్స, మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితమని కలెక్టర్ తెలిపారు.