News June 27, 2024
తూ.గో: రవాణా శాఖకు రూ.275 కోట్లు ఆదాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719446005385-normal-WIFI.webp)
తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పన్నులు, ఫీజులు, అపరాధ రుసుముల రూపేనా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.275 కోట్ల ఆదాయం వచ్చింది. వాహన జీవిత కాల పన్నులుగా రూ.113 కోట్లు, క్వార్టర్లీ పన్నులుగా రూ.35 కోట్లు, ఫీజుల రూపేనా రూ.11 కోట్లు, సర్వీస్ ఛార్జీలుగా రూ.27 కోట్లు, వాహన తనిఖీల ద్వారా అపరాధ రుసుము రూపేన రూ.89 కోట్లు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News July 1, 2024
క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719807160738-normal-WIFI.webp)
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు హైవే పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు కలెక్టర్ శన్మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
News July 1, 2024
తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719804610787-normal-WIFI.webp)
డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.
News July 1, 2024
తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719787799200-normal-WIFI.webp)
తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.