News December 4, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

image

రాజానగరం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నందరాడకు చెందిన దంపతులు లీలా ప్రసాద్ (23), సోనియా (20) మృతి చెందారు. బ్యాంకు పని నిమిత్తం స్కూటీపై రాజానగరం వచ్చి, వైఎస్ఆర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా.. రాజమహేంద్రవరం వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో వారి మూడు నెలల పసిపాప అనాథగా మిగిలింది.

Similar News

News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 8, 2025

మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: కలెక్టర్

image

మహిళలకు తగిన అవకాశం కల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో, ఐదు రోజుల ఈవెంట్ మేనేజ్‌మెంట్ శిక్షణను పూర్తి చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను మహిళా SHG సభ్యులకు అప్పగించేలా అవకాశాలు కల్పించాలని DRDO సురేందర్‌ను ఆయన ఆదేశించారు.

News December 8, 2025

స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకం: ASF కలెక్టర్

image

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల నిర్వహణలో స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సక్రమంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.