News November 16, 2024
తూ.గో: సోషల్ మీడియాలో పోస్ట్లు.. ఒకరి అరెస్ట్

CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఉమ్మడి తూ.గో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం(D) కనిగిరికి చెందిన మునగాల హరీశ్వర్ రెడ్డి కొన్ని పోస్టులు చేశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని శుక్రవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచారు.
Similar News
News August 20, 2025
తూ.గో: ఓవర్స్పీడ్పై స్పెషల్ డ్రైవ్.. 298 కేసులు నమోదు

వేగంగా వాహనాలు నడిపిన వారిపై వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 298 ఓవర్స్పీడ్ కేసులు నమోదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ డ్రైవ్ ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు కొనసాగిందని, ఈ-చలానాల రూపంలో రూ.3.10లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ స్పెషల్ డ్రైవ్ల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
News August 19, 2025
‘మత్తు’కు దూరంగా ఉండండి: ఈగల్ ఐజీ

రాజమండ్రి సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ ఐజి ఏకే రవికృష్ణ మంగళవారం మాట్లాడారు. ఎన్డీపీఎస్ చట్టం తీవ్రతను వారికి ఆయన వివరించారు. భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. అనంతరం గంజాయి వాడబోమని ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.