News December 23, 2025

తూ.గో: 500 అడిగి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

image

అమలాపురం మెట్ల కాలనీలో దీపక్‌రాజ్‌(18) సోమవారం <<18637820>>ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే<<>>. చెడు వ్యసనాలకు బానిసైన అతడు ఆదివారం రాత్రి మద్యం కోసం తల్లిని రూ.500 అడిగాడు. ఆమె డబ్బులు పంపడంతో మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 30, 2025

భూపాలపల్లి: జాగ్రత్త.. పులి మళ్లీ వచ్చే అవకాశం!

image

జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం కోనరావుపేట మీదుగా పులి సంచరించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొనరావుపేట మీదుగా ములుగు జిల్లా అబ్బాపురం, జాకారం, పందికుంట, మల్లంపల్లి ద్వారా పాకాల అటవీ ప్రాంతానికి పెద్దపులి వెళ్లినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ తిరిగే వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అడవికి పోవద్దని ములుగు, భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు.

News December 30, 2025

తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది: DGP

image

TG: పోలీస్ వార్షిక నివేదిక-2025ను DGP శివధర్‌రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్‌రేట్‌ 2.33% తగ్గిందని వెల్లడించారు. 2025లో 782 హత్యలు జరిగాయని తెలిపారు. పోలీసులు సేవాభావంతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ ఏడాది 509మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు లేకుండా నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, మెస్సీ పర్యటన విజయవంతమయ్యాయని వివరించారు.

News December 30, 2025

బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

image

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసుకోవాలి.